TG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు ప్రెస్మీట్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలో కొనసాగుతున్న క్యాబినెట్ సమావేశంలో, ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
Read Also: GHMC Counseling: రసాభాసగా కొనసాగిన కౌన్సిలింగ్ సమావేశాలు
ఈ రోజే షెడ్యూల్ విడుదల చేసి, ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫికేషన్(Notification) జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల(Panchayat Elections)ను మూడు దశల్లో నిర్వహించాలనే ప్రతిపాదనపై SEC దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: