Telugu News: Panchayat Elections: జగిత్యాలలో తల్లి-కూతురు ఎన్నికల పోరు

Read Time:  1 min
Panchayat Elections
Panchayat Elections
FONT SIZE
GET APP

తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) తొలి విడతలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అరుదైన రాజకీయ పోరు చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లి గ్రామంలో తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లెపు సుమలత ఇద్దరూ సర్పంచ్ పదవికి బరిలో నిలవడం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది.

Read Also: HYD: మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్

 Panchayat Elections
Panchayat Elections: Mother-daughter election battle in Jagityal

ప్రేమ వివాహం చేసుకున్న సుమలతను తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించిన నేపథ్యం ఉండటంతో ఈ పోటీ గ్రామస్థుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరూ ఒక్క గ్రామంలోనే నివసిస్తూ, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చింది.

91 ఓట్ల ఆధిక్యంతో కూతురి గెలుపు

బీసీ మహిళ రిజర్వేషన్ ఉన్న ఈ సర్పంచ్ స్థానానికి గంగవ్వ బీఆర్ఎస్ మద్దతుతో, సుమలత కాంగ్రెస్(Congress) మద్దతుతో పోటీ చేశారు. చివరికి 91 ఓట్ల మెజారిటీతో సుమలత విజయం సాధించి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైంది. ప్రేమ వివాహం కారణంగా కుటుంబంలో నెలకొన్న విభేదాల మధ్య కూతురు విజయం సాధించడం గ్రామంలో చర్చనీయాంశమైంది.సుమలత తన విజయం తర్వాత మాట్లాడుతూ—గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తానని చెప్పారు.

తొలి విడత పంచాయతీ పోలింగ్ — కాంగ్రెస్ ప్రభంజనం

డిసెంబర్ 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) అర్థరాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ఈ విడతలో దాదాపు అన్ని జిల్లాల్లో ముందంజలో నిలిచి, ఏకగ్రీవాలతో సహా మొత్తం 2,383 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 1,146 స్థానాల్లో విజయం సాధించగా, 455 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. సిద్దిపేట తప్ప మిగతా ప్రాంతాలన్నింటిలో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.