📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

KCR : ఏపీకి మన నీటి హక్కులను ధారాదత్తం చేశారు – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: July 1, 2025 • 6:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో (Krishna Water) ఉండాల్సిన హక్కులను ధారాదత్తం చేసిన ఘనత మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు (KCR), మాజీ మంత్రి హరీశ్ రావు వారికి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలవరం – బనకచర్లపై ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన, గతంలో వారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు.

2015లో జరిగిన సంతకాలే తెలంగాణకు ముప్పు

“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి కృష్ణా జలాలుగా 811 టీఎంసీలు కేటాయించగా, అందులో తెలంగాణ(Telangana)కు 299 టీఎంసీలే సరిపోతాయని, 68% జలాలు ఏపీకి కేటాయించడానికి అభ్యంతరం లేదని 2015లో అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు,” అని రేవంత్ ఆరోపించారు. ఇదే సంతకాలే తెలంగాణ హక్కులను కాజేసిన మరణశాసనంలా మారాయి అని వ్యాఖ్యానించారు. నీటి విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన నేతలు అప్పట్లో అజాగ్రత్తగా వ్యవహరించారని చెప్పారు.

నీటి హక్కుల కోసం న్యాయ పోరాటం

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం – తెలంగాణకు న్యాయమైన నీటి వాటా సాధించటం అని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేలా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల జీవనాధారమైన నీటి విషయంలో రాజీ పడబోమని, అన్ని వేదికల్లో రాష్ట్ర హక్కులు నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : BRS : మాకు రాగిసంకటి, రొయ్యలపులుసుతో పనిలేదు – సీఎం రేవంత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.