📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Assembly : అసెంబ్లీలో పట్టువిడవని విపక్షలు.. బీఆర్ఎస్‌కు షాక్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: March 27, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Assembly : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు వాయిదా తీర్మానాలు కోరగా అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నో చెప్పారు. ఇప్పటికే ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లుగా సభాపతులు ప్రకటించగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక, బీజేపీ తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీఓ నెం.317పై చర్చకు పట్టబడుతూ వాయిదా తీర్మానమిచ్చింది.

స్పీకర్ ఆఫీసులో వాయిదా తీర్మానం

మరోవైపు సీపీఐ దళితులు గుడిసెలు వేసుకున్న స్థలాలను వారికే కేటాయించాలని కోరుతూ స్పీకర్ ఆఫీసులో వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇదిలాఉండగా, నేటితో సమావేశాలు ముగుస్తుండగా స్పీకర్ అనుమతితో డిప్యూటీ సీఎం సభలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దానిపై చర్చ ముగిశాక కేంద్రం తీసుకురాబోతున్న లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

రైతాంగాన్ని కాపాడలన్న సోయిలేదు

కాగా, చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం కానీ.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారు. మేం ఏదైనా మాట్లాడితే.. మా గొంతు నొక్కుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడలన్న సోయిలేదు. రైతులు ఇబ్బంది పడవద్దని కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీలను పక్కన పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి అని ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.

assembly Breaking News in Telugu brs Google news Google News in Telugu Latest News in Telugu opposition parties Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.