📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ponnam Prabhakar: ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా లేదు : మంత్రి పొన్నం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 25, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ponnam Prabhakar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం సభలో 56 శాతం బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై మాట్లాడే సందర్భంగా ప్రతిపక్షం తరఫున సభలో నలుగురు కూడా లేరు. ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. బలహీన వర్గాల పట్ల శ్రద్ధ లేదని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అన్నీ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి

ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అన్నీ వారి సామాజిక వర్గమే. పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి. మేం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవి ఒక్కో వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాం. మేం చేసిన కులగణన వల్ల 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రంలో అమలు చేసి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ సభ్యులపై ఉంది. మహేశ్వర్‌రెడ్డి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి అని పొన్నం సూచించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ పద్దులను శాసనసభ ఆమోదించింది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu minister ponnam prabhakar opposition Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.