ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ చర్యపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతత్వమని ఆయన ఆరోపించారు.రేవంత్ రెడ్డి తన పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే దర్యాప్తు సంస్థలను వాడుతున్నాడు, అంటూ హరీశ్ ఆరోపించారు. కేటీఆర్పై నోటీసులు దీనికి నిదర్శనమని చెప్పారు.ఒక్కసారైనా గ్యారంటీలు అమలు చేయలేకపోతే, కేటీఆర్ ప్రశ్నలు వేస్తున్నారు. అందుకే ఆయన నైతిక ధైర్యాన్ని కూల్చే ప్రయత్నం ఇది, అని హరీశ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే కుట్ర ఇది అన్నారు.18 నెలల పాలనలో రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలే నడిపారు, అని హరీశ్ విమర్శించారు. అయినా, ప్రజలు ఇక మోసపోవడం లేదు. రేవంత్ డ్రామా రాజకీయాలు బయటపడుతున్నాయి, అని చెప్పారు.
ఫార్ములా-ఈ రేసుతో రాష్ట్ర ప్రతిష్ఠ పెరిగింది
తెలంగాణలో ఫార్ములా ఈ రేసు నిర్వహణ ఎంతో ప్రతిష్ఠగా జరిగిందని హరీశ్ చెప్పారు. కేటీఆర్ కృషితో హైదరాబాద్లో ప్రపంచస్థాయి రేసు జరిగింది. పెట్టుబడులు కూడా వచ్చాయి. అమర రాజా వంటి కంపెనీలు ముందుకొచ్చాయి, అని వివరించారు.2000లో చంద్రబాబు ఫార్ములా వన్కు ప్రయత్నించి విఫలయ్యాడు. కానీ కేటీఆర్ సాధించగలిగాడు, అని హరీశ్ గుర్తు చేశారు. ఈ విజయాన్ని రేవంత్ ఓర్చుకోలేకనే దాడులకు దిగుతున్నాడని ఆరోపించారు.
అందాల పోటీల్లో పరువు తీయడం
కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు (Beauty pageants) నిర్వహించి రాష్ట్ర పరువు తీసింది, దేశాన్ని సైతం తీసుకెళ్లింది అని హరీశ్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కేటీఆర్పై ఏసీబీ నోటీసులు వచ్చాయి, అన్నారు.రేవంత్ రెడ్డి.. ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ పాలన వైఫల్యాలను బీఆర్ఎస్ బయటపెట్టడం ఆగదు, అని హరీశ్ స్పష్టం చేశారు.
Read Also : Ahmedabad plane crash : విమాన ప్రమాదం డీజీసీఏ కీలక నిర్ణయం