हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG Municipal Elections : మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

Sudheer
TG Municipal Elections : మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న ‘మహాలక్ష్మి’ పథకం అమలుపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మహిళ “మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 నగదు ఏమైంది?” అని అడిగిన ప్రశ్నకు మంత్రి వివేక్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రభుత్వం నేరుగా నగదు రూపంలో ఇచ్చే దానికంటే, వివిధ పథకాల ద్వారా మహిళలు పొందుతున్న పొదుపు ఎక్కువేనని ఆయన వివరించారు. నగదు బదిలీ అనేది కేవలం ఒక పక్షమైతే, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సౌకర్యాలు కుటుంబ ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయని ఆయన మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

CollectorRahulRaj: కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మంత్రి తన ప్రసంగంలో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ లెక్కలు వివరించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా సుమారు రూ. 800, సన్నబియ్యం పంపిణీ ద్వారా రూ. 2,500, మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా నెలకు సుమారు రూ. 500 చొప్పున మహిళలకు ఆదా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అంటే, మహిళలకు నేరుగా నగదు రాకపోయినా, ఈ పథకాల ద్వారా నెలకు సుమారు రూ. 3,000 కంటే ఎక్కువే ప్రభుత్వం నుంచి ‘పరోక్షంగా’ లబ్ధి పొందుతున్నారని ఆయన వాదించారు. ఈ లెక్కలు ఇప్పుడు రాజకీయంగా మరియు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి.

మంత్రి వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం తన హామీలను అమలు చేస్తున్న తీరును సమర్థించుకుంటున్నప్పటికీ, నిరుపేద మహిళలు మాత్రం తమకు నేరుగా అందాల్సిన నగదు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. “ఇచ్చే పథకాల లెక్కలను ఇలా కలపడం ఎంతవరకు సమంజసం?” అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా, ప్రభుత్వం మాత్రం తాము అందిస్తున్న సంక్షేమం విలువను ప్రజలకు వివరించే పనిలో ఉంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ‘లెక్కల వివాదం’ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870