📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nizamabad: ఇందల్వాయిలో ప్రైవేటు బస్సు బోల్తా ఘటనలో అసలు ఏం జరిగిందంటే?

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇందల్వాయిలో బోల్తాపడిన బస్సు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు వెళుతున్న ప్రైవే టు బస్సు ఒక మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులు దుర్మణం చెందారు. నిజామాబాద్ లోని ఇందల్వా యి మండలం గన్నారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణీకులు వున్నారు. వీరంతా హైదరాబాద్ నుం చి వివాహం కోసం అకోలాకు వెళుతున్నారు. మరణించిన వారిలో మంజూషా (29) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు రిషి (7), అబ్బాస్ (22 ), ఇంకో వ్యక్తి వున్నాడు. ఇదే ఘటనలో మరో 15 మంది గాయపడగా వీరిలో పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంటనే జిల్లా ఆ సుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Mera Ration Feature: రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

Nizamabad: Private Bus Overturns in Indalwai Four Dead

బస్సు ప్రమాదంలో ఎనిమిది రామచిలుకల మృతి

ఇదే ఘటనలో ప్రయాణీకులతో పాటు ఒక బుట్టలో కుక్కినట్లు వున్న 60 రామ చిలుకలు వుండగా ప్రమాద తరువాత ఈ బుట్ట దూరంగా ఎగిరిపడింది. ఈ ఘటనలో ఎనిమిది రామ చిలుకలు ఊపిరి ఆడక మరణించాయి. ఈ ఘటన తరువాత పోలీసులు, రవాణా శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రామ చిలుకల బుట్టను వేరుచేసి సజీవంగా వున్న వాటికి మంచీనీరు తాగించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. గాయపడి ఎగురలేని రామ చిలుకలను స్థానిక పశువైద్య శాలకు తరలించి చికిత్స అందించారు. ఇవి కోలుకున్న తరువాత స్వేచ్చగా వదిలిపెడతామని అధికారులు తెలిపారు. రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై పోలీసులు వేరుగా విచారణ చేబట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Indalwai Gannaram nizamabad bus accident Parrots died Private Bus Road Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.