తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్రవాద అనుమానితుడిని ఎన్.ఐ.ఏ (NIA) అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఆకస్మిక ఆపరేషన్ స్థానికంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది.
పోలీసుల సమన్వయంతో విస్తృత తనిఖీలు
బోధన్ (Bodhan) పట్టణంలో ఎన్.ఐ.ఏ, పటియాలా పోలీసుల బృందాలు కలిసి భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్కు స్థానిక పోలీసుల కూడా సహకారం అందించారు. ఈ తనిఖీలలో ఐసిస్ (ISIS) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు.
కోర్టు హాజరు అనంతరం ఢిల్లీకి తరలింపు
అనుమానితుడిని బోధన్లోని స్థానిక న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం పీటీ వారెంట్ పై ఢిల్లీకి తరలించారు. ఆపరేషన్లో హుజైఫా నుంచి ఒక ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఉగ్రవాద ముప్పు పై ఎన్.ఐ.ఏ ప్రత్యేక దృష్టి
దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్.ఐ.ఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. ఐసిస్ సంస్థతో సంబంధాలున్న అనుమానితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో హషన్ డ్యానిష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు దేశవ్యాప్తంగా అల్లర్లకు కుట్ర పన్నుతున్నాడని పోలీసులు వెల్లడించారు.
డ్యానిష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బోధన్లో దాడి
హషన్ డ్యానిష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్.ఐ.ఏ అధికారులు దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో మరొక అనుమానితుడిని అదుపులోకి తీసుకోగా, అదే సమయంలో తెలంగాణలో బోధన్ పట్టణంలో ఈ సోదాలు నిర్వహించారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా హుజైఫా ఎమన్ను అరెస్టు చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: