Nizam Club election delay : ఎన్నికలు నాలుగు నెలలకుపైగా వాయిదా పడటంతో తీవ్ర అధికార పోరు మొదలైంది. 140 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే ఆలస్యం కావడం కావడంతో క్లబ్ పరిపాలన పూర్తిగా స్థంభించిందని సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రాజ కుటుంబ సభ్యులు ఉన్న క్లబ్లో లోతైన విభేదాలు ఏర్పడ్డాయి.
ఈ వివాదం జూన్ 2025లో జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశం (EGM) నుంచే మొదలైంది. పాలనలో మార్పులు, పదవీకాలాన్ని నాలుగేళ్లకు పరిమితం చేయడం, మాజీ అధ్యక్షులకు దిగువ పదవుల్లో పోటీ నిషేధం వంటి అంశాలపై ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే గందరగోళం తలెత్తడంతో సమావేశాన్ని వాయిదా వేసి, ప్రతిపాదనలపై ఓటింగ్ జరగలేదు.
Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్
EGM అనంతరం గౌరవ కార్యదర్శి అమరేందర్ రెడ్డి పదవీకాలం ముగిసినా కొనసాగుతున్నారని కొందరు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఆయన మాత్రం బైలాస్ ప్రకారం ఎన్నికల వరకు కొనసాగవచ్చని వాదించారు. అయితే సివిల్ కోర్టు తాజా ఉత్తర్వుల్లో, ఎన్నికలు జరగని పరిస్థితుల్లో పదవీకాలం ముగిసిన కార్యదర్శి కొనసాగడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కార్యదర్శి అధికారాలపై వివాదం మరింత ముదిరింది.
ఈ స్థబ్ధత వల్ల క్లబ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని సభ్యులు చెబుతున్నారు. చెక్కులపై సంతకాలు, సమావేశాల అనుమతులు, సరఫరాదారుల చెల్లింపులు నిలిచిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. 1884లో Mehboob Ali Pasha స్థాపించిన ఈ క్లబ్కు ప్రస్తుతం 6,200కుపైగా సభ్యులు ఉండగా, మౌలిక సదుపాయాల క్షీణతపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: