Nirmal Road Accident: నిర్మల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీరని విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ బైపాస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Telangana Assembly: స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?
టైరు పేలిపోవడంతో తప్పిన నియంత్రణ
నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండలం సోన్పల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం బంధువులతో కలిసి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు డీసీఎంలో బయలుదేరారు. వాహనం కొండాపూర్ బైపాస్ సమీపానికి చేరుకోగానే టైరు పేలిపోవడంతో స్టీరింగ్ పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 17 మంది ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: