News Telugu: బంగాళాఖాతం నుండి విదర్భ ప్రాంతాల వరకు సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో దక్షిణ ఛత్తీస్గడ్ నుండి విదర్భ మీదుగా ఉత్తర ఆంధ్ర వరకు రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ఫలితంగా వచ్చే రెండు రోజులు తెలంగాణ (Telangana)లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగనున్నాయి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు సెప్టెంబర్ 2 వరకు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా ఉండే అవకాశముంది.
శనివారం వర్ష సూచన
శనివారం (ఆగస్టు 30) ఆదిలాబాద్ (Adilabad), భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
ఆదివారం వర్షాల అంచనా
ఆదివారం కూడా (ఆగస్టు 31) ఇదే తరహా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రైతులు, పౌరులు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
గడిచిన 24 గంటల వర్షపాతం
ఇటీవలి 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో గాంధారి మండల కేంద్రం మరియు సర్వాపూర్లో అత్యధికంగా 27.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: