📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News Telugu: Coal- కొత్తగూడెం రీజియన్ లో ఒకటిన్నర లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

Author Icon By Sharanya
Updated: August 29, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సత్తుపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ ప్రభావం మూలంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం మూలంగా ఓపెన్ కాస్టు గనుల్లోకి నీరు చేరటంతో కొత్తగూడెం (Kothagudem) సింగరేణి రీజియన్ పరిధిలోని మూడు డివిజన్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బుధ, గురు, రెండు రోజులు పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఎగువ ప్రాంతాలు నుంచి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు రావటంతో కొత్తగూడెం సింగరేణి రీజియన్ పరిధిలో కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, డివిజన్ల పరిధిలో లక్ష,50, వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలగగా, 12 లక్షల 20వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు.

News Telugu

లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది

కొత్తగూడెం రీజియన్ పరిధిలోని కొత్తగూడెం డివిజన్లోని, సత్తుపల్లి జేవిఆర్ సి కిష్టారం ఓపెన్ కాస్టు గనులలో రెండు రోజులు పాటు కురిసిన భారీ వర్షాలకు వంద మిల్లిమీటర్ల వరకు భారీవర్షం కురవడంతో ఈ గనుల్లోకి నీరు చేరి ఇక్కడ లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా (lakh tons coal has stopped), ఐదు లక్షల 20వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బార్డెను అంతరాయం ఏర్పడింది. అలాగే మణుగూరు డివిజన్లో పికె ఓసి, ఎంఓసి, కెపియుజి, గనులలో వర్షపు నీరు చేరటంతో రెండు రోజులలో ఈ గనులలో 64 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది, ఆరులక్షల క్యూబెక్కు మీటర్ల ఓవర్ బర్ణేనుకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. అలాగే ఇల్లందు డివిజన్లో కోయగూడెం ఓసిలో రెండు రోజులు పాటు కురిసిన భారీ వర్షానికి గనిలో నీరు చేరటం వల్ల 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, లక్ష క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్, (ఓబి) కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులు పాటు కురిసిన ఈ భారీ వర్షాల వల్ల సత్తుపల్లి పట్టణంలో 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఈ రెండు రోజులు పాటు కురిసిన వర్షం ఎప్పుడు కురవలేదని అధికారులు పేర్కొంటున్నారు. గనుల్లోకి వర్షపు నీరు చేరటంతో బొగ్గు రవాణా చేసే వాహనాలు ఎక్కడ అక్కడ నిలిచిపోయాయి. గనుల్లో చేరిన వర్షపు నీరును పెద్ద పెద్ద పైపులు సహాయంతో నీటిని బయటికి తోడే ప్రయత్నంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జెవిఆర్, కిష్టారం, ప్రాజెక్టు అధికారులు ఎన్విఆర్ ప్రహ్లాద్, ఎంవి నరసింహా టరావులు గురువారం ప్రభాతవార్తకు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-kunamneni-sambasiva-rao-save-public-sector/telangana/537686/

Breaking News Coal production coal shortage Kothagudem coal latest news power generation Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.