📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఉగాది నుంచే కొత్త రేషన్‌ కార్డుల జారీ !

Author Icon By sumalatha chinthakayala
Updated: March 6, 2025 • 7:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్ ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఖరారు చేశారు. లేత నీలి రంగులో కొత్త రేషన్ కార్డును తయారుచేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాను ఖరారు చేశారు. రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు

ఇప్పటికే రేషన్ కార్డులు పొందిన వారికి కూడా కొత్త కార్డులు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ కొత్త నమూనా రేషన్ కార్డులు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూకట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో…కొత్త రేషన్ కార్డులు పొందేందుకు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు

ఈ ఏడాది మార్చి 30న ఉగాది పండుగ నిర్వహించుకోనున్నాం. ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల ద్వారా కొత్తగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 13 లక్షల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu New ration cards Telugu News online Ugadi festival

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.