Neredmet crime: హైదరాబాద్లోని నేరేడ్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య వేధింపుల కారణంగానే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41), జ్యోతి దంపతులు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, జ్యోతి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించిన తర్వాత భర్త శ్రీనివాస్ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం శ్రీనివాస్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
Read Also: Karimnagar crime: దర్శనం పేరిట 18 లక్షలు తీసుకున్న పూజారి
భర్తకు దూరంగా ఉండటమే కాకుండా, జ్యోతి అతనిపై వరకట్న వేధింపుల కేసుతో పాటు విడాకుల కోసం కూడా కోర్టును ఆశ్రయించింది. తనపై అక్రమ కేసులు పెట్టడం, సమాజంలో పరువు తీయడం వంటి చర్యలతో శ్రీనివాస్ తీవ్రంగా కుంగిపోయాడు. భార్య చేస్తున్న వేధింపులను తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ‘నా భార్య వేధింపుల వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని స్పష్టంగా సూసైడ్ నోటు రాశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: