హైదరాబాద్ (Hyderabad) : ప్రస్తుతం నేపాల్ లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాల మేరకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ను 3 ఏర్పాటు చేసింది. దీని ద్వారా నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేయనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు నేపాల్లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
News Telugu
నేపాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
నేపాల్లో ఎవరైనా తెలంగాణ చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను సంప్రదించవచ్చు. వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ అండ్ లైజన్ హెడ్ 9871999044, జి.రిక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ 9643723157, సిహెచ్.చక్రవర్తి ప్రజా సంబంధాల అధికారి 9949351270 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ పౌరులకు నేపాల్లో (Nepal) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Q1: నేపాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
A1: నేపాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
Q2: తెలంగాణ పౌరులు ప్రస్తుతం నేపాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?
A2: ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Q3: తెలంగాణ ప్రభు
Read hindi news:hindi.vaartha.com
Read Also: