జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ (congress) పార్టీ మరోసారి తన దూకుడును చూపించింది. ఈ కీలక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. మొత్తం 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన ఆయన, మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఈసీ విడుదల చేసిన తుది లెక్కల ప్రకారం, నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులలో బేర బాలకిషన్ అత్యధికంగా 175 ఓట్లు పొందడం గమనార్హం. ఈ ఎన్నికలో మొత్తం 924 మంది నోటాకు ఓటు వేశారు.
Read also: thrift : మన పొదుపే ఆరోగ్యానికి మదుపు
Naveen Yadav: నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ
కాంగ్రెస్ విజయం సాధించడం
జూబ్లీహిల్స్ వంటి ప్రతిష్ఠాత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఉపఎన్నిక ఫలితాలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి మరింత బలం చేకూర్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: