Breaking News – Jubilee Hills Bypoll : నవీన్, సునీత నామినేషన్లకు ఆమోదం

Read Time:  1 min
Breaking News – Jubilee Hills Bypoll : నవీన్, సునీత నామినేషన్లకు ఆమోదం
FONT SIZE
GET APP

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన అనిశ్చితి తొలగిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఆమోదం పొందాయి. గత కొన్ని రోజులుగా నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాల్లో సాంకేతిక లోపాలున్నాయనే బీఆర్ఎస్ వాదనతో అనుమానాలు వ్యక్తమవుతుండగా, చివరికి ఆర్వో వాటిని సమీక్షించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. అదే సమయంలో మాగంటి సునీత నామినేషన్ కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదం పొందింది.

Latest News: Hardik: హార్దిక్ తిరిగి జట్టులో

ఆర్వో నిర్ణయంపై స్పందించిన నవీన్ యాదవ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ తనపై రాజకీయ ప్రేరేపణతో తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఆరోపించారు. “నా పత్రాలు అన్ని చట్టబద్ధంగా సమర్పించాను. వాటిపై ఆర్వో పూర్తి స్థాయి పరిశీలన జరిపి ఆమోదించారు. ఇది నా నిర్దోషిత్వానికి నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. అలాగే తాను ఎవరి నామినేషన్పైనా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీకి సిద్ధమని, ప్రజల తీర్పుపైనే తన విశ్వాసమని నవీన్ తెలిపారు.

ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈసారి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్రులతో సహా పలు చిన్న పార్టీల అభ్యర్థులు పోటీ రంగంలోకి దిగడంతో, స్క్రూటినీ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉండటంతో, ఈ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.