అంతరాష్ట్ర నకిలీ బంగారం(Gold) దొంగల ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. (Nalgonda) నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి శనివారం వెల్లడించారు. 16 డిసెంబర్, 2025న నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధి నెహ్రూగంజ్ ప్రాంతంలోని వినాయక కిరాణా షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి కిరాణా సామను తీసుకున్నారు. ఈ క్రమంలోనే దుకాణ యజమానితో పరిచయం చేసుకుని, మాటలు కలిపి పాత బంగారం తక్కువ ధరకు రూ.15 లక్షల విలువైన బంగారం కేవలం రూ.5 లక్షలకే ఇస్తామని నమ్మించారు.
Read also: Sambasiva Rao: మోదీపై కూనంనేని వ్యాఖ్యలు..స్పందించిన కిషన్

వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి
నమ్మిన షాప్ యజమాని బ్యాంక్ వద్దకు తీసుకెళ్లి రూ.5 లక్షలు డ్రా చేసి వారికి ఇచ్చాడు. కాగా వారు అతడికి నకిలీ బంగారాన్ని అంటగట్టారు. (Nalgonda) దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం తన (డీఎస్పీ శివరాం రెడ్డి) ఆధ్వర్యంలో వన్ టౌన్, సీసీఎస్ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నిందితులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు ఏడుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా వెల్లడించారు. ఏ1-రమేశ్ కుమార్ (30), ఏ2-పురన్ కుమార్ (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు), ఏ3-రాజా రామ్ (38), ఏ4-మహేంద్ర కుమార్ (19), ఏ5-మానా రామ్ (38), ఏ6-సురేశ్ కుమార్ (28), ఏ7- దేవా రామ్ (45). వీరు ప్లాస్టిక్ వస్తువుల అమ్మకం పేరుతో పట్టణ శివారులోని కతాలగూడెం శివారులో గుడిసెలు వేసుకుని కుటుంబ సభ్యులతో జీవిస్తున్నట్లు చెప్పారు. కేసును విజయవంతంగా చేధించిన డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజ శేఖర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐలు లచ్చిరెడ్డి, వెంకట నారాయణ, సిబ్బంది విష్ణు, రబ్బానీ, అంజయ్య, సిసిఎస్ సిబ్బంది వహీద్, దస్తగిరి, మహేశ్, నాగరాణిని ఎస్పీ అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: