హైదరాబాద్: తెలంగాణలో అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర (MSP) లభించేలా చూడాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో(Hyderabad) జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవసరమున్న చోట కొత్తగా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులను యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలు, నిఘా
ప్రస్తుతం మార్కెట్ ధరలు ఎంఎస్పీ కంటే క్వింటాల్కు రూ.1,099 తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాటన్(Cotton) కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 122 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, అదనంగా సిరిసిల్ల జిల్లా(Sircilla District) కొనరావుపేటలో కొత్త కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పత్తి అమ్మకాల నిమిత్తం ఏర్పాటు చేసిన ‘కపాస్ కిసాన్’ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తేమ శాతం, నాణ్యత, తూకం ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు స్థానిక మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్ మిల్లులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రోజువారీ క్రయవిక్రయాలను పర్యవేక్షించాలన్నారు.
పత్తి సేకరణ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది?
అక్టోబర్ నుంచే పత్తి సేకరణ ప్రారంభమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతులను ఎలా రిజిస్టర్ చేయించాలి?
పత్తి విక్రయాల కోసం రైతులను ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని మంత్రి సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: