ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్ల చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లా (Nalgonda District) నాగార్జునసాగర్ (Nagarjunasagar) పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డులో ఇంజెక్షన్ వికటించి పలువురు చిన్నారులు అనారోగ్యబారిన పడ్డారు.
Read Also: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకల..భారీ గా భక్తుల సంఖ్య
పిల్లల వార్డులో చిన్నారులకు వికటించిన ఇంజెక్షన్లను వైద్యులు ఇచ్చారు. కొద్దిసేపటికే వీరంతా వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వీరిని హుటాహుటిగా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
17 మంది చిన్నారుల పరిస్థితి
ప్రస్తుతం చిన్నారులు కోలుకుంటున్నారు. కాగా అస్వస్థతకు గురైన 17 మంది చిన్నారుల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సకాలంలో వారికి మెరుగైన వైద్యం అంది కోలుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: