📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Nagar Kurnool: 111 ఆదివాసీ జంటలకు ఒకే వేదికపై పెళ్లిళ్లు

Author Icon By Sushmitha
Updated: October 27, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్(Nagar Kurnool) జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చెంచు గిరిజన యువతీ యువకులకు అద్భుతంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవులను నమ్ముకొని జనజీవనానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలను ఒక్కచోటుకు చేర్చి, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ 111 మందికి సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

Read Also: ISRO: ఇస్రో మరో బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధం

గవర్నర్ సహా ప్రముఖుల ఆశీస్సులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జ్ టి. మాధవి దేవి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆదివాసి కల్యాణ ఆశ్రమం అఖిల భారత కార్యకారిణి రేఖ నాగర్, ప్రాంత అధ్యక్షులు కాట్రాజు వెంకటయ్య, శ్రీశ్రీశ్రీ అంబత్రాయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పర శ్రీ స్వామిలు హాజరయ్యారు. సామూహిక వివాహాలు చేసుకున్న దంపతులను వీరంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) మాట్లాడుతూ, అడవి బిడ్డల వివాహానికి హాజరుకావడం ఆనందంగా ఉందని, ఈ ప్రాంత చెంచు గిరిజనులను మరొకసారి కలుసుకుంటానని అన్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆదివాసీల వివాహాలు జరిపించడం అభినందనీయమని బండారు దత్తాత్రేయ నిర్వాహకులను అభినందించారు.

వివాహ ధృవీకరణ పత్రాల ప్రదానం

హైకోర్టు జడ్జ్ టి. మాధవి దేవి మాట్లాడుతూ సామూహిక వివాహాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం సామూహిక వివాహాలు(marriages) చేసుకున్న నూతన వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రాలను గవర్నర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వనవాసి కల్యాణ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఉడతనూరి లింగయ్య, తెలంగాణ ఆదివాసి మహిళా ప్రముఖ గుర్రం శంఖులత, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో సామూహిక వివాహాలను ఎవరు నిర్వహించారు?

వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంతమంది చెంచు గిరిజన జంటలకు వివాహాలు జరిపించారు?

మొత్తం 111 చెంచు గిరిజన జంటలకు వివాహాలు జరిపించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Chechu tribe Google News in Telugu Governor Vishnu Dev Varma Latest News in Telugu mass weddings Nagarkurnool Telugu News Today Vanavasi Kalyan Parishad.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.