Municipal Elections: తెలంగాణలో పలు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులు కొత్త నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. నిజామాబాద్ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమారాణి ఎన్నికయ్యారు. కరీంనగర్ నగర మేయర్ బాధ్యతలను బీజేపీ నేత కొలగాని శ్రీనివాస్ స్వీకరించగా, నల్గొండ మేయర్గా కాంగ్రెస్కు చెందిన బుర్రి చైతన్య బాధ్యతలు చేపట్టారు. అలియాబాద్ మున్సిపాలిటీలో ఛైర్పర్సన్గా కాంగ్రెస్ నేత కంఠం శిరీష ఎన్నికయ్యారు.
Read Also:Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ
మున్సిపల్ కార్యాలయంపై దాడి ఘటన
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఖానాపూర్ ఎన్నిక వాయిదా
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, సభ్యుల కోరం లేకపోవడంతో ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: