Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగజ్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతుతో ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షాహిన్ సుల్తానా చైర్పర్సన్గా ఎంపిక కాగా, బీజేపీకి చెందిన లావణ్య వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
Read Also:TG Municipality Election: లక్కీ డ్రాలో కాంగ్రెస్ అభ్యర్థికి దక్కిన మేయర్ పీఠం
అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి యూనస్ ఛైర్మన్గా, శిరీష వైస్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఫలితాలతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ ప్రభావం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మరోవైపు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. కారణాలను త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎలక్షన్ కోడ్) అధికారికంగా రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలకు మళ్లీ స్వేచ్ఛ లభించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: