తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా వరంగల్ (Warangal) జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (Municipal Election Results) మొదటిగా విడుదల చేసిన ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థి 7 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ కోరారు. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించగా ఫలితం మారింది. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి 13 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు.
Read Also: Nalgonda Municipal Election Results: నల్గొండ జిల్లాను కైవసం చేసుకున్న కాంగ్రెస్
ఈ పరిణామంతో కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. (Municipal Election Results) పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారులు మాత్రం రీకౌంటింగ్ పూర్తిగా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో మున్సిపల్ ఎన్నికల్లో రీకౌంటింగ్ ప్రక్రియపై మరోసారి చర్చ మొదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: