📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Municipal Election: ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ కు హైకోర్టు షాక్!

Author Icon By Saritha
Updated: February 17, 2026 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Municipal Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ (BRS) పార్టీకి హైకోర్టు షాకిచ్చింది. నిన్న వాయిదాపడిన 11 మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఒకటి. 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు ఒక స్థానం కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకుంది. ఛైర్మన్‌గా టేకు సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.

Read Also: Ibrahimpatnam Municipal Elections: ఇబ్రహీంపట్నంలో హైడ్రామా..మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ!

Municipal Election: Ibrahimpatnam Chairman Election High Court shocks BRS!

19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడంతో ఈ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని ఎల్లుండి తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి వరకు ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు స్టే అందే సమయానికి సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దాంతో, హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Akula Yadagiri BRS party Latest News in Telugu Municipal Election Take Sudarshan Reddy Telangana High Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.