Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రణరంగాన్ని తలపిస్తోంది. సోమవారం ఉదయం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా, అందులో సీనియర్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకపోవడంతో కలకలం రేగింది. ఆయన భార్య వసంత, కుమారుడు టోనీ వాహనాన్ని అడ్డుకుని “మా ఆయన ఎక్కడ? మా తండ్రి అక్కడ?” అంటూ ఆవేదనతో నిలదీశారు.
Read Also: KTR Formula E race : ఫార్ములా ఈ కేసు, కేటీఆర్పై చార్జిషీట్ ఈ వారం?
బీఆర్ఎస్కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్కే మద్దతు
బీఆర్ఎస్ నేతలే ఆయనను చైర్మన్ కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని పక్కకు నెట్టివేయడంతో తోపులాట జరిగింది. మరోవైపు, అదృశ్యమయ్యారని భావించిన స్వతంత్ర కౌన్సిలర్ దాసరి మురళీకృష్ణ ఒంటరిగా కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఆయనను అడ్డుకున్న కుటుంబ సభ్యులు బీఆర్ఎస్కు ఓటు వేయవద్దని, కాంగ్రెస్కే మద్దతు తెలపాలని ఒత్తిడి చేయడం గమనార్హం. అటు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్(BRS) కౌన్సిలర్ల రాకతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: