Mumbai Climate Week : ముంబయిలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరగనున్న ముంబయి క్లైమేట్ వీక్ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ రోజు రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి రేపటి ప్రధాన సమావేశంలో పాల్గొననున్నారు. పర్యావరణ హిత పాలన, పునరుత్పాదక ఇంధన వినియోగం, గ్రీన్ అభివృద్ధి దిశగా తెలంగాణ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రపంచ వేదికపై వివరించనున్నారు.
ముంబయి క్లైమేట్ వీక్ భారతదేశంలో పౌర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రముఖ పర్యావరణ వేదికగా నిలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుమారు 30 దేశాల ప్రతినిధులు, పరిశ్రమల నాయకులు, పర్యావరణ నిపుణులు పాల్గొననున్నారు. తెలంగాణను పర్యావరణహిత పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ ఈ వేదికను వినియోగించనున్నారు.
Read Also: Bill Gates: బిల్ గేట్స్తో మరోసారి సమావేశంపై చంద్రబాబు స్పందన
రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల విస్తరణకు పెట్టుబడులను ఆకర్షించడం, ముసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై అంతర్జాతీయ నిపుణుల సలహాలు పొందడం ఆయన ప్రధాన లక్ష్యంగా ఉంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనే వ్యవసాయ విధానాలు, గ్రీన్ ఎనర్జీ వైపు మార్పు, పట్టణ ఉష్ణోగ్రతల నియంత్రణ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరువాత మరోసారి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ సదస్సు కీలక వేదికగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: