📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

సర్కారులో చలనం వచ్చింది: కేటీఆర్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: December 14, 2024 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో మండిపడ్డారు. గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం విద్యార్థులను ఆసుపత్రి మెట్లు ఎక్కించిందని కేటీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభంగా మార్చేశారని విమర్శించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడంలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కల్పించుకుని గురుకులాల బాట పట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చిందని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఏడాది పాలనలో సామాన్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో భయాందోళనలు నింపిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు.. అన్నట్లు పాలకులు ఇప్పుడు గురుకులాలను సందర్శించడం మొదలుపెట్టారని చెప్పారు. నామమాత్రంగా సందర్శించి, ఫొటోలు దిగి రాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెమెరాల ముందు హడావుడి చేయడంతో సరిపెట్టకుండా గురుకులాల బిడ్డల గుండె చప్పుడు వినాలని, గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.

brs Congress govt Gurukula Hostels ktr Residential Schools students

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.