Moinabad drugs case: రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల కస్టడీపై సోమవారం తీర్పు

Read Time:  1 min
Moinabad drugs case: రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితుల కస్టడీపై సోమవారం తీర్పు
FONT SIZE
GET APP

Moinabad drugs case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫాంహౌస్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ముగ్గురు వ్యక్తుల కస్టడీ పిటిషన్పై రాజేంద్రనగర్ కోర్టు సోమవా రం నాడు తీర్పు వెలువరించనుంది. ఈ మేరకు న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నెల 14వ తేదీ రాత్రి మొయినాబాద్ లోని అజీజ్నగర్లో గల రోహిత్ రెడ్డి ఫాం హౌస్లో పోలీసులు దాడిచేసిన సమయంలో రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్ రివాల్వర్ను నమిత్ శర్మ తీసుకుని పోలీసులను పోలీసులను భయపెట్టేందుకు భయపెట్టేందుకు గాలిలో గాలిలో నా నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం సంచలనం రేపింది.

Read Also : Air India, AI 185: 8 గంటల గాలిలో ప్రయాణం.. చివరకు ఢిల్లీలోనే ల్యాండింగ్

Moinabad drugs case: Verdict on custody of three accused including Rohit Reddy on Monday
Moinabad drugs case: Verdict on custody of three accused including Rohit Reddy on Monday

పోలీసులపై కాల్పులు జరపాలని రోహిత్ రెడ్డి పురిగొల్పినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో రోహిత్ రెడ్డి తన ఫాం హౌస్లో అసాంఘీక కార్యకలాపాలకు స్థానం కల్పించినందుకు, తన లైసెన్స్ రివ్వార్ను మరో వ్యక్తికి ఇచ్చి నందుకు రితేష్ రెడ్డిని, మరొకరి రివాల్వర్చేత పోలీసులపై కాల్పులు జరిపినందుకు నమిత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ సేవించిన ఎంపి మహేష్ కుమార్ యాదవ్ సహా అందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కాగా పోలీసులు అరెస్టు చేసిన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో వుండగా, వీరిపై డ్రగ్స్ వాడడం, అక్రమంగా మాదకద్రవ్యాలు కలిగి వుండడంతో పాటు హత్యాయ త్నం కేసు నమోదు చేశారు. దీనిపై శుక్రవారం నాడు మరోసారి విచారించిన న్యాయమూర్తి తీర్పును సోమవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.