Moinabad Drug Party: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఈ హైప్రొఫైల్ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ద్వారా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 11 మంది పాల్గొన్నట్లు ‘ఈగల్ టీమ్’ గుర్తించింది. పార్టీలో కేవలం మద్యం మాత్రమే కాకుండా, కొకైన్ వంటి ప్రాణాంతక మాదకద్రవ్యాలను కూడా వినియోగించినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read Also: Hyderabad Farmhouse Drug Parties: ఫాంహౌస్ లపై కొరవడిన నిఘా
పోలీసుల దర్యాప్తు ప్రకారం, నిందితులు కొకైన్ను మద్యంలో కలుపుకుని సేవించినట్లు సమాచారం. ఘటన అనంతరం అక్కడ ఉన్న 11 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, అందులో ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు దాడి చేసిన సమయంలో నిందితులు ప్రతిఘటించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. తాము పోలీసులమని చెప్పినప్పటికీ, సుమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు రితేష్ రెడ్డి వద్ద ఉన్న రివాల్వర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా కౌశిక్ అనే వ్యక్తి తాను సిమ్లాలో కొకైన్ కొనుగోలు చేసినట్లు అంగీకరించగా, రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకే అందరూ ఈ పార్టీకి హాజరైనట్లు వెల్లడైంది.
ఎంపీ పుట్ట మహేష్ కు పాజిటివ్?
మరోవైపు, ఈ డ్రగ్స్ కేసులో తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేరు తెరపైకి రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. డ్రగ్స్ టెస్టులో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం స్టేషన్ బెయిల్పై ఉన్న ఆయన, సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, కేవలం మిత్రుల ఆహ్వానం మేరకే డిన్నర్కు వెళ్లానని స్పష్టం చేశారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని తాను వమ్ము చేయనని, తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: