శ్రీకాళహస్తి : పదేళ్ళ కెసిఆర్ (KCR) పాలన తెలంగాణాకు స్వర్ణయుగం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శ్రీకాళి హస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతుదోష నివారణ పూజలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కుటుంబ సమేతంగా జరిపించుకున్నారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక రాహుకేతు దోష నివారణ పూజలను ఆలయంలోని సహస్రలింగేశ్వరుని ఆలయం వద్ద వేదపండితులతో జరిపించారు. తరువాత స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసారు. తరువాత మృత్యుంజయ ఆలయం వద్ద వేదపండి తులచే ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ పదేళ్ళ పాలన స్వర్ణయుగంగా మారిందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. నేడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
Read also: రేపటి నుంచి 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం
ప్రజల సమస్యలపై త్వరలో యాత్ర ప్రారంభం – కవిత ప్రకటన
రాజకీయం గాను తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో యాత్ర చేపట్ట బోతున్నట్లు కవిత (MLC Kavitha) ప్రకటించారు. యాత్రలో ప్రజలతో మమేకమౌతున్నట్లు వివరించారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని యాత్రను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ నిర్మాణాన్ని రానున్న రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని కవిత అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి కెసిఆర్ కుమార్తె కల్వకుంట కవిత కుటుంబసభ్యులతో రాగా ఆమెకు మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదనరెడ్డి సారధ్యంలో స్వాగతం పలికారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మైనారిటి నాయకులు పఠాన్ ఫరీదాఖాన్, అస్లాం, సాగిరాబీ, షర్మిలాఠాగూర్ తదితరులు స్వాగతం పలికారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: