హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 112 ఓటర్లు ఉండగా, వీరిలో 81 మంది కార్పొరేటర్లు మరియు 31 మంది ఎక్సాఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఈసారి ఎన్నికలలో హాట్ కాంపిటీషన్ నెలకొంది, ముఖ్యంగా MIM పార్టీ తరఫున మీర్జా రియాజ్, BJP తరఫున గౌతంరావు పోటీలో ఉన్నారు.
పోటీకి దూరంగా BRS , కాంగ్రెస్
ఈ ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే, మిగిలిన పార్టీలైన BRS, INC ఈ పోటీకి దూరంగా ఉన్నా, వారి ఓట్లు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 38 ఓటర్లు ఉండగా, వీరి ఓట్లు ఎటు మళ్లతాయన్న ఉత్కంఠ పెరిగింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం, MIMకు 50 ఓట్లు, BJPకు 24 ఓట్లు, BRSకు 24 ఓట్లు, INCకు 14 ఓట్లు ఉండగా, ఒకే ఒక్క ఓటు తేడా కూడా గెలుపును ప్రభావితం చేసే పరిస్థితి ఉంది.
వేడెక్కిన రాజకీయ వాతావరణం
ఇక అసలు ఉత్కంఠ రేపటి కౌంటింగ్లో చూడాల్సి ఉంది. ఏ పార్టీకి ఇతర పార్టీల మద్దతు లభిస్తుందో అనేది ఫలితాల అనంతరం స్పష్టమవుతుంది. ముఖ్యంగా BRS, INC వంటి పార్టీలు ఓటింగ్లో పాల్గొననప్పటికీ, వారి ఓట్లు ఎవరికి మద్దతుగా నిలుస్తాయోనన్న అనుమానాలు రాజకీయం తారస్థాయికి చేరుస్తున్నాయి. మొత్తంగా, హైదరాబాద్ MLC ఎన్నికలు ఉత్కంఠగా మారిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.