📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Miryalaguda: తాగునీరు అనుకుని రసాయనం ఇచ్చిన తల్లి.. కుమారుడు మృతి

Author Icon By Pooja
Updated: December 28, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నల్గొండ(Miryalaguda) జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మందు ఇచ్చిన తల్లి, పొరపాటున తాగునీరు అనుకుని ప్రమాదకర రసాయనాన్ని తాగించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read Also: Mumbai crime: కొడుకు కావాలని కన్నకూతురిని చంపిన తల్లి

Miryalaguda: A mother gave her son a chemical substance thinking it was drinking water; the son died.

జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరిన విద్యార్థి

వివరాల్లోకి వెళ్తే.. అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సత్యనారాయణ–రామలింగమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు గణేష్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల రెండు రోజులుగా జ్వరం రావడంతో అతడిని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చారు.

శనివారం ఉదయం గణేష్‌ను మిర్యాలగూడలోని(Miryalaguda) ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్య సిబ్బంది పారాసిటమాల్ మాత్ర ఇవ్వాలని సూచించారు. తల్లి మందు ఇచ్చిన అనంతరం తాగునీరు కోసం చూడగా సమీపంలో నీరు అందుబాటులో లేకపోవడంతో పక్కనే ఉన్న ల్యాబ్ గదిలోకి వెళ్లింది. అక్కడ ఉన్న క్యానులోని ద్రవాన్ని నీరేనని భావించి బాటిల్‌లో నింపి కుమారుడికి తాగించింది.

ఫార్మాల్డిబైడ్ తాగడంతో వెంటనే అస్వస్థత

అయితే ఆ ద్రవం తాగునీరు కాకుండా ఫార్మాల్డిబైడ్ అనే ప్రమాదకర రసాయనం అని తేలింది. రెండు గుటకలు తాగిన వెంటనే గణేష్ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

ఆస్పత్రిలో తాగునీరు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాదకర కెమికల్‌ను ఎలాంటి హెచ్చరికలు లేకుండా ల్యాబ్‌లో ఉంచడమే ఈ దుర్ఘటనకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu hospital tragedy Latest News in Telugu Nalgonda district news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.