📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Author Icon By Sudheer
Updated: January 18, 2025 • 9:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేషన్ కార్డుల జారీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అవకాశం ఉన్నప్పటికీ, పాత రేషన్ కార్డులను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలను మంత్రి ఖండించారు.

రేషన్ కార్డుల జాబితాలో పేరు లేనివారు నిరాశ పడాల్సిన అవసరం లేదని, గ్రామ సభల ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశముందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కులగణన ఆధారంగా కార్డుల జారీ ప్రక్రియ మరింత సక్రమంగా ఉంటుందని మంత్రి వివరించారు.
పాత రేషన్ కార్డులు రద్దు చేస్తారని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు అవకాశం కల్పిస్తామని, ప్రస్తుత విధానాలు పౌరుల ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వం తీసుకున్న చర్యలు పారదర్శకంగా ఉండేలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని మంత్రి చెప్పారు. గ్రామ సభలలో దరఖాస్తులను స్వీకరించడంతో పాటు, తగిన అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయడం ద్వారా పేద ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డులు పొందడంలో ఎదురవుతున్న సమస్యలను సత్వర పరిష్కారం చేస్తామని మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ration cards uttam kumar reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.