Minister Uttam Kumar: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలి. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాం అని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. NDSA నివేదిక చూసి సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. మేడిగడ్డ సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలలు పడ్డాయి. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు అని మండిపడ్డారు.
ప్రజలను తాకట్టుపెట్టి కాళేశ్వరం కట్టారు
హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు డిజైన్ మొదలు.. నిర్మాణం, కూలిపోవడం అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిపోయిందన్నారు. రూ. లక్ష కోట్లకు ప్రజలను తాకట్టుపెట్టి కాళేశ్వరం కట్టారని, ప్రణాళిక లేకుండా నాసిరకం మెటీరియల్లో నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకోవడానికి కట్టారని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయని, రైతులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని మంత్రి పేర్కొన్నారు.
ఎన్డీఎస్ఏ రేవంత్ రెడ్డో.. నేనో వేసింది కాదు
నిర్మాణం చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు రైతులకు ద్రోహం చేశారు. ఎన్డీఎస్ఏ రేవంత్ రెడ్డో.. నేనో వేసింది కాదు. దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఎన్డీఎస్ఏలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ వచ్చింది. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై అధ్యయనం చేస్తాం. వచ్చే కేబినెట్ లోఎన్డీఎస్ఏ పై చర్చించి చర్యలు తీసుకుంటాం. ఎవడి అయ్య జాగీరు అని కట్టారు.. అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు ధరించి ముస్లింల ప్రార్థనలు