హైదరాబాద్: తెలంగాణ గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింగ్కు (Shivraj Singh Chauhan Singh) మంత్రి సీతక్క విజప్తి చేశారు. గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ సచివాలయం నుండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Seethakka) మాట్లాడుతూ తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు సజావుగా జరుగుతోందని, కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమని అన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనలో భాగంగా కేంద్రం కేటాయించిన రూ.368.7 కోట్లలో ఇప్పటివరకు రూ.129.64 కోట్లు వినియోగించామని, మిగిలిన నిధులను నవంబర్ లోపు పూర్తిగా ఖర్చు చేస్తామని తెలిపారు. దక్కన్ పీఠభూమి నేలల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ పథకానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సీతక్క విజప్తికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారు. వచ్చే సెప్టెంబర్ 4,5తేదీల్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మంత్రుల చింతన్ శివిర్” జరుగనుందని, అందులో తెలంగాణ అవ సరాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలను ఆ వేదికపై ప్రదర్శించాలని సూచించారు. అలాగే గ్రామీణమహిళల ఆర్థిక బలోపేతం కోసం కేంద్రం నుంచిపూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇవ్వగా మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: