📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Minister Seethakka: పంచాయతీలకు కేంద్రం రూ.387 కోట్లు విడుదల

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Minister Seethakka : గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 646.36 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అందించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల విని యోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Read Also: Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!

Minister Seethakka: Centre releases Rs. 387 crore for Panchayats

రూ.2,400 కోట్ల వరకు నిధులు

గ్రామాల్లో మౌళిక వసతుల అభివృద్ధి, పారి శుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం సుమారు రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల సమగ్రాభివృద్ధి స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జీవనోపాధుల కింద ప్రభుత్వ సహకారం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఆమె తెలిపారు. కాగా.. ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కింద ప్రభుత్వ సహకారంతో మహిళలు రాణిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం, పాలంపేట గ్రామంలోని(Development) గాయత్రీ జుపి పరిధిలోని సరస్వతి స్వయంసహాయక సంఘం సభ్యురాలు వరులాభరణం అవర్ణ స్వయం ఉపాధి దిశగా రుచి రెస్టారెంట్ యూనిట్ను స్థాపించారని, ఈ యూనిట్ మొత్తం వ్యయం రూ.8,50,000 అని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

15th Finance Commission central government funds Gram Panchayat Development minister seethakka Telangana news Telangana Panchayat Funds

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.