Minister Seethakka : గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ. 646.36 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అందించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల విని యోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!
రూ.2,400 కోట్ల వరకు నిధులు
గ్రామాల్లో మౌళిక వసతుల అభివృద్ధి, పారి శుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం సుమారు రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల సమగ్రాభివృద్ధి స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జీవనోపాధుల కింద ప్రభుత్వ సహకారం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఆమె తెలిపారు. కాగా.. ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కింద ప్రభుత్వ సహకారంతో మహిళలు రాణిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం, పాలంపేట గ్రామంలోని(Development) గాయత్రీ జుపి పరిధిలోని సరస్వతి స్వయంసహాయక సంఘం సభ్యురాలు వరులాభరణం అవర్ణ స్వయం ఉపాధి దిశగా రుచి రెస్టారెంట్ యూనిట్ను స్థాపించారని, ఈ యూనిట్ మొత్తం వ్యయం రూ.8,50,000 అని వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: