రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన కాసేపట్లో ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించనున్నారు.
Read Also: Chevella Accident: రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి
మీర్జాగూడ ఘటన కలిచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR) ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: