📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Congress : కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం కీలక పిలుపు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 28, 2025 • 7:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Congress : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే మొదటి శత్రువు అని కేసీఆర్ మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే సంగతి కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఏరు దాటేదాకా ఎల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా కేసీఆర్ వైఖరి ఉందని విమర్శించారు.

సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని నిండు అసెంబ్లీలో కేసీఆరే చెప్పారని గుర్తుచేశారు. ఆరోజు సోనియా గాంధీని దేవత అని కూడా సంబోధించారని అన్నారు. కేసీఆర్ రెండు నాల్కల ధోరణికి నిరసనగా.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులను కోరారు. కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే.. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం అయ్యేదా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ లేకపోతే.. కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. సభకు అనుకున్న రేంజ్‌లో జనాలు రాకపోయేసరికి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని.. ఆ అక్కసును కాంగ్రెస్‌పై కక్కారని మండిపడ్డారు.

Read Also : కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం కీలక పిలుపు

Breaking News in Telugu Congress leaders Google News in Telugu KCR Latest News in Telugu minister ponnam prabhakar Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.