Latest News: Minister Ponguleti – తిరుమలగిరిలో 3వేల మంది అనర్హులు

Read Time:  1 min
Minister Ponguleti
Minister Ponguleti
FONT SIZE
GET APP

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ : పేదప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti SriniVasareddy) అధికారులకు సూచించారు. సచివాల యంలో మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపించి జఠిలం చేయొద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు.

నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నియోజకవర్గంలో 40 నుంచి 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు, కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఐతే నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీ శాఖకు చెందినవని అధికారులు కొర్రీ వేస్తున్నారన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పని చేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ భారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గంలోని తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు.

Minister Ponguleti

మిగిలిన 403 ఎకరాలకు సంబంధించి

ఈ పైలట్ ప్రాజెక్ట్ (A pilot project) కోసం 235 సర్వే నెంబర్లను ఎంపిక చేశామన్నారు.. మొత్తం 23 వేల ఎకరాలో సర్వే నిర్వహించగా, అందులో 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు. ఇందులో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. వాటి 4. వేల ఎకరాలు పాసు పుస్తకాలతో సాగు ఉన్నాయని వివరించారు. మిగిలిన 403 ఎకరాలకు సంబంధించి కొత్త పాసు పుస్తకాలా ఇవ్వవలసి ఉందన్నారు. ఈ సర్వేలో 293 ఎకరాలకు సంబంధించి 3069 మంది వ బోగస్ పాసు పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి వా పాసు పుస్తకాలను రద్దు చేశామని తెలిపారు.

వీటికి రైతు భరోసా, రైతు బీమా (Farmer’s Insurance) తదితరాలనా రద్దు చేశామన్నారు. సర్వేలో భాగంగా 7 వే ఎకరాలు అటవీ భూమిని గుర్తించామని, ఈ భూములకు సంబంధించిన వివాదాలను పీల్లె నంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకా సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి = జానా రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు కె జయవీర్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయిక్, రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లో కేā కుమార్, పీసీసీఎస్ సి. సువర్ణ, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-hyderabad-liberation-day-celebrated-with-grandeur-under-the-auspices-of-bjp/telangana/548729/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.