తెలంగాణలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.హైదరాబాద్తో సమానంగా నల్గొండను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన కార్పొరేటర్లు అభివృద్ధికి కృషి చేయాలని, ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని వెల్లడించారు.
Read Also: Mangapet: దేవునికి పెట్టిన దీపం అంటుకుని పాన్ షాప్ దగ్ధం
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: