📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

కొత్త కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..ధర తెలిస్తే షాకే

Author Icon By Sudheer
Updated: February 11, 2025 • 8:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్

తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఇటీవల ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో విడుదలైన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అత్యాధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. మైనంపల్లి రోహిత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ షేడ్ కలిగిన ఈ కారును ఆయన సొంతం చేసుకోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ లుక్ పరంగా ప్రముఖ జీ-వాగెన్ ఐస్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు ఉండగా, ఒకటి ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం అందుబాటులో ఉన్నాయి.

ఈ కారులో మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హీట్ & కూల్ సీట్లు వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. నాలుగు చక్రాలకు నాలుగు మోటార్లు ఉండటంతో ఈ ఎలక్ట్రిక్ కారు అధిక శక్తిని ప్రదర్శించగలదు. 116 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ ఎస్‌యూవీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ఈ వేరియంట్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉండటంతో కేవలం 32 నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అత్యుత్తమ వేగాన్ని అందించగల ఈ కారు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలోనే అందుకోగలదు. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. మెర్సిడెజ్ బెంజ్ గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీని ఎక్స్-షోరూం ధర రూ.3 కోట్లు కాగా, రోడ్డు ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Google news Mercedes-Benz G580 mla mynampally rohit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.