📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Mepma employees: మెప్మా ఉద్యోగులకు అదనంగా రూ.10 వేలు అలవెన్స్

Author Icon By Ramya
Updated: August 6, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్వరలోనే అధికారిక ఉత్తర్వులు

హైదరాబాద్ : తెలంగాణలోని మెప్మా ఉద్యోగులకు (Mepma employees) శుభవార్త. త్వరలోనే అలెవెన్సులతో కూడిన పూర్తి జీతం అందనుంది. రూ. 10 వేల అలవెన్సు అదనంగా ఇవ్వనున్నారు. గత యేడాది ఆగస్టులో సెర్ప్ సిబ్బందితో సమానంగా పూర్తి పేస్కేల్ పొందుతున్న 378 మంది ఉద్యోగులకు.. మే నెల నుంచి తగ్గిపోయిన జీతాలు త్వరలో మళ్లీ పూర్తి స్థాయిలో రానున్నాయి. అలవెన్సుల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. వారికి తిరిగి రూ. 32 వేల వరకు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పురపాలక సంస్థల్లో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందనుంది. వారికి అన్నిరకాల అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వ డానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

మెప్మా ఉద్యోగులకు త్వరలోనే రూ.10 వేలు అలవెన్స్ తిరిగి

ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా రూ.10 వేలు ఇచ్చేందుకు సర్కార్ రెడీగా (government is ready) ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది. కాగా, మెప్మా (Mepma employees) లో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు గత యేడాది ఆగస్టులో సెర్చ్ సిబ్బంది. మాదిరిగానే పూర్తి పేస్కేల్ (Payscale) అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెలా సుమారు రూ.32,000 వేతనం పొందేవారు. అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపు రూ.10 వేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అలవెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ, అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వివరించారు.

మెప్మా ఉద్యోగులకు ఎంత అదనపు అలవెన్సు ఇవ్వనున్నారు?

మెప్మా ఉద్యోగులకు రూ.10 వేల అదనపు అలవెన్సు ఇవ్వనున్నారు.

ప్రభుత్వం ఏ ఆధారంగా పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది?

ప్రభుత్వం కమిటీ నివేదిక ఆధారంగా పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-wife-murder-husband-youtube-plan-lover-assist/breaking-news/526703/

allowances Breaking News government-orders latest news mepma-employees salary-hike Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.