📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Meghalaya Team: తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన మేఘాలయ సభ్యుల బృందం

Author Icon By Ramya
Updated: July 9, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అసెంబ్లీ హాల్లో మేఘాలయ బృందానికి (Meghalaya Team) హృదయపూర్వక స్వాగతం

హైదరాబాద్: మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యేల బృందం (Meghalaya Team) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్లో మేఘాలయ రాష్ట్ర బృందానికి పిఎసి చైర్మన్ ఆర్కేపూడి గాంధీతో కలిసి మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమై తెలంగాణ, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల గురించి సభ్యులకు వివరించారు. అసెంబ్లీ నిర్వహించే విధానంతో పాటు, అసెంబ్లీ లో ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేసే చట్టాలను రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వారికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే (Mahabubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం ఉద్దేశ్యాలను, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఔన్నత్యం గురించి మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందానికి ఆయన వివరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో “విద్యా నిధి” ఏర్పాటు, మహబూబ్ నగర్ ఫస్ట్ లక్ష్యాలను, నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత కోచింగ్, నైపుణ్య శిక్షణ సెంటర్ గురించి కూడా వారికి వివరించారు. ఈ సందర్భంగా మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందం అసెంబ్లీ సమావేశాల గురించి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి, మహబూబ్ నగర్ విద్యా నిధి గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చార్లెస్ పిన్రోప్, ఎమ్మెల్యేలులహెన్ రింబుల్, రూపా లీ. మార్క్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

మేఘాలయ రాష్ట్ర బృందం తెలంగాణ అసెంబ్లీకి ఎందుకు వచ్చారు?

అసెంబ్లీ కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను తెలుసుకోవడానికే వారు తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏమి వివరించారు?

ఆయన విద్యా నిధి, ఉచిత కోచింగ్, నైపుణ్య శిక్షణ కేంద్రాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి గురించి వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: R. Krishnaiah: ఫీజు బకాయిలు చెల్లించండి

AssemblyVisit Breaking News latest news MeghalayaMLAs MeghalayaTeam PACVisit TelanganaAssembly Telugu News YennamSrinivasReddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.