📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముగిసిన సమావేశం

Author Icon By Sudheer
Updated: August 4, 2025 • 6:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై జరిగిన సమావేశం ముగిసింది. ఈ నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. ముఖ్యంగా, ప్రాజెక్టు వైఫల్యాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు ఈ కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. నివేదికలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌ల పాత్రలపై కూడా ప్రస్తావన ఉందని, కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే కాళేశ్వరం నిర్మాణాలు చేపట్టినట్లు కమిషన్ నిర్ధారించినట్లు సమాచారం.

ఆర్థిక లోపాలు, అధికారుల పాత్ర

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక శాఖతో పాటు పలువురు అధికారుల లోపాలపై కూడా కమిషన్ (Commission ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంచనాల పెంపు, నిధుల వినియోగంలో జరిగిన అక్రమాలను కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడంలో అధికారుల పాత్రపై నివేదికలో స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కేబినెట్ భేటీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

కాళేశ్వరం కమిషన్ నివేదికపై రేపు జరగనున్న కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఈ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనుంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు, వాటికి బాధ్యులైన వారి వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది.

Read Also : Bill Gates : ఏఐతో ఉద్యోగాలకు ముప్పు : బిల్ గేట్స్ కీలక విశ్లేషణ

Kaleshwaram Commission kaleshwaram project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.