📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Medchal Crime: పదో తరగతి బాలిక తో రహస్య పెళ్లి.. ఆ తర్వాత ఏమైంది?

Author Icon By Rajitha
Updated: February 10, 2026 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గురువును దైవంతో సమానంగా భావించే మన సమాజాన్ని కలచివేసే ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వెలుగుచూసింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికను భావోద్వేగంగా మోసం చేశాడు. విద్య నేర్పాల్సిన వ్యక్తి, మైనర్ బాలికను ప్రేమ పేరుతో ప్రలోభపెట్టి ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా బయటపడటంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Read also: Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

Secret marriage with a tenth grade girl

ప్రేమ ముసుగులో నేరం మైనర్ బాలికతో రహస్య పెళ్లి

వివరాల్లోకి వెళ్తే, పోచారం డివిజన్‌లోని ఓ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్‌గా పని చేస్తున్న పర్రే మైటీన్‌ (27) అనే వ్యక్తి, పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దృష్టి పెట్టాడు. మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. తెలిసీ తెలియక బాలిక అతడిని నమ్మింది. అదే నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకున్న ఉపాధ్యాయుడు, ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కూడా బాలికను యథావిధిగా స్కూల్‌కు పంపిస్తూ విషయం బయటపడకుండా చూసుకున్నాడు.

తల్లి అనుమానం… పోలీసుల చర్య పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్ట్

కొద్ది రోజుల క్రితం బాలిక మెడలో పసుపు తాడు కనిపించడంతో తల్లి అనుమానపడింది. మొదట బాలిక తప్పించుకునే ప్రయత్నం చేసినా, గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు స్కూల్ నిర్వాహకులను ప్రశ్నించగా, సరైన స్పందన రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఉపాధ్యాయుడిపై పోక్సో (POCSO) చట్టం కింద చర్యలు చేపట్టి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Minor girl case POCSO law school safety teacher crime Telangana crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.