గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. అయితే, కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం చేసిన తర్వాత మేడారం (Medaram) పరిసరాలు భారీగా చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేయడం ప్రస్తుతం అధికార యంత్రాంగం మరియు పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది.
Read Also: Jeevan Rao: ఏడాదిలో పనితీరు లేకపోతే రాజీనామా!

వ్యర్థాల్లో 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాలు
మేడారం(Medaram)పరిసర గ్రామాల్లో దాదాపు 3 వేల టన్నుల చెత్త(Garbage)పేరుకుపోయినట్లు అధికారులు అంచనా, జంతు, కోళ్ల వ్యర్థాలు కుళ్లిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రపరిచే పనులను వేగవంతం చేస్తున్నారు.
ఈ శుభ్రతా పనుల్లో ఉన్న కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ క్లీనింగ్ అని చెప్పి తీసుకొచ్చారని, కానీ జంతు అవశేషాలు, కోళ్ల వ్యర్థాలతో కూడిన అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని వారు వేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి కృపతోనే ఈ పనిని భరిస్తున్నామని చెబుతూ భావోద్వేగానికి లోనవుతున్నారు. వ్యర్థాల్లో దాదాపు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటివి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com