అధికారులతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్ : మేడారం Medaram సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన మేడారం అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, CM Revanth Reddy, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Srinivas Reddy సూచనలతో సచివాలయం నుంచి మంత్రి సీతక్క, వరంగల్ నుంచి మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Medaram
సమావేశానికి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామ య్యార్, ఆర్ అండ్ బీఈఎన్సీ BENC మోహన్ నాయక్, పంచాయతీ రాజ్ ఈఎన్సీ ఎన్. ఆశోక్, దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ, ‘మేడారం అభివృద్ధి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడంతో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది ఒక మహా ఘట్టం. ఈ చరిత్రాత్మక పనిలో మీరు అందరూ భాగమవుతున్నారు. Medaram ఈ కృషి శాశ్వతంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలని భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని అని మంత్రులు స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యాల కోసం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. అలాగే మేడారం అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి వర్కింగ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డిజైన్స్ల్ను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, తదనుగుణంగా పనుల అంచనాలను సిద్ధం చేసి టెండర్లు తక్షణమే పిలవాలని మంత్రులు ఆదేశించారు.
మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళికను ఎవరు ఖరారు చేశారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మేడారం అభివృద్ధి పనులపై సమీక్షలో పాల్గొన్న మంత్రులు ఎవరు?
సీతక్క, కొండా సురేఖ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: