ములుగు జిల్లా : నిర్ణీత సమయంలో మేడారం మహా జాతర (Medaram Jatara) అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం మేడారంలో జరుగుతున్న సమ్మక్క భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి జంపన్నవాగు స్నానఘట్టాలు పరిశుభ్రంగా ఉంచాలి సీతక్క క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మేడారంలోని ఐటిడిఏ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.
Read Also: DTC Kishan: డిటిసి అవినీతిలో రూ.200 కోట్లు!
జంపన్న వాగులో స్నాన ఘట్టాలు పరిశుభ్రంగా ఉంచాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ జంపన్న వాగు పరిస రాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. (Medaram Jatara) భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న సందర్భంలో స్నాన మట్టాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవాలని, కొంగలమడుగు ఏరియా నుండి జంపన్న వాగు వరకు రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమ్మక్క సారలమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, పనులలో ఇంకా వేగం పెంచాలని, గంటలు లేబర్ ను అదనంగా తెప్పించి షిఫ్ట్ ల వారిగా 24 అభివృద్ధి పనులు చేపట్టాలని గుత్తేదారులను మంత్రి అధికారులను, ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు గుత్తేదారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, పార్కింగ్ స్థలాలను, బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న పనులను, విఐపి, వివిఐపి రోడ్లను శ్రీరామ్ సాగర్ చెరువు, రోడ్ల విస్తరణ ను, జంపన్న వాగు దగ్గర ఉన్న స్నాన ఘట్టాలను మంత్రి పరిశీలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: